BRS KTR: మార్చి1న బిఆర్ఎస్ చలో మేడిగడ్డ.. రాజకీయ వైరంతో ప్రాజెక్టులకు ముప్పు కలిగించొద్దన్న కేటీఆర్
BRS KTR: మార్చి1న చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డకు బయలుదేరుతామని ప్రకటించారు.