MP Vijayasai Reddy :తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న వైసీపీ ఎంపీ, కుట్ర కోణం ఉందని కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
Complaint On Ysrcp MP Vijayasai Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లోనే కూలిపోతుందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్, వైసీపీ కలిసి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.